![]() |
![]() |
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు:(Illu illalu pillalu ). ఈ సీరియల్ గురువారం నాటి ఎపిసోడ్ -237 లో..... శ్రీవల్లి ఆడపడుచు కట్నంగా రోల్డ్ గోల్డ్ ఇచ్చిందని కామాక్షి కోపంగా ఇంటికి వస్తుంది. ఆ తర్వాత శ్రీవల్లిపై కామాక్షి కోప్పడుతుంది. భాగ్యం, శ్రీవల్లి కలిసి ఏదో ఒకటి చేసి డైవర్ట్ చేస్తారు. ఈ నగలు మా చిన్న కూతురివి దానివి ఇందులో కలిసిపోయినవని భాగ్యం అంటుంది. ఇదేంటమ్మ చీప్ గా నేను ఎయిర్ పోర్ట్ పక్కన రెండు ఎకరాలు నీ పేరు మీద రాయిస్తానని భాగ్యం అంటుంది.
దాంతో కామాక్షి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతే కాదు ఫిబ్రవరి ముప్పై తారీఖున నీకు రిజిస్ట్రేషన్ చేపిస్తానని భాగ్యం అనగానే కామాక్షి మురిసిపోతుంది. తింగరిది కనీసం ఫ్రిబ్రవరి ముప్పై ఉండదన్న విషయం కూడా తెలియదని భాగ్యం నవ్వుకుంటుంది. అదే విషయం కామాక్షి వచ్చి నా పెద్ద మరదలు ఆడపడుచు కట్నంగా ఏం ఇస్తుందో తెలుసా అని చెప్తుంది నర్మద, ప్రేమ వాళ్లకు చెప్తుంది. అదంతా విని.. ఇందులో ఏదో తేడా ఉందని ప్రేమ, నర్మద అనుకుంటారు. నగలు విషయం ఎప్పుడు వచ్చిన అక్క ఎందుకు టెన్షన్ పడుతుంది. విషయం తేల్చాలని అనుకుంటారు
ఆ తర్వాత ప్రేమ, నర్మద రామరాజు దగ్గరికి వచ్చి.. రేపు శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటామని అడుగుతారు. అందుకు వేదవతి, రామరాజు సరే అంటారు. ఇందులో వాళ్ళ ప్లాన్ ఏదో ఉందని భాగ్యం, శ్రీవల్లి అనుకుంటారు. ఏ ప్లాన్ అయిన ఎదురుకొడతా అని భాగ్యం అంటుంది. మరొకవైపు రేపు నగల గురించి బయటపడుతుందని ప్రేమతో నర్మద అంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |